Hyderabad, మే 18 -- యోగా కొన్ని భంగిమల ద్వారా శరీరంలోని ఎన్నో లోపాలను వ్యాధులను తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. అలాంటి వాటిలో మత్స్యాసనం ఒకటి. థైరాయిడ్, థైమాస్ గ్రంథులను ఉత్తేజపరిచేలా ఈ మత్స్యాసనం పనిచేస్తుంది. గొంతు, మెడలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళన కూడా చాలా వరకు తగ్గుతుంది.

మత్స్యాసనం ప్రతిరోజూ వేయడం వల్ల మెడ, గొంతు సాగుతాయి. దీనివల్ల థైరాయిడ్, థైమాస్ గ్రంధులలో ఉన్న లోపాలు చాలా వరకు తీరిపోతాయి. అంతేకాదు థైరాయిడ్ పనితీరును మెరుగుపరిచేలా మత్స్యాసనం కృషి చేస్తుంది. ఈ భంగిమ థైరాయిడ్ తో పాటు థైరాయిడ్ చుట్టుపక్కల ప్రాంతాలకు రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేసి థైరాయిడ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కేవలం థైరాయిడ్ సమస్యతో బాధపడే వారికే కాదు నాడీ వ్యవస్థ సమస్యలు ఉన్నవారు కూడా మత్స్యాసనం వేయడం ఎంతో అవసరం. ఇది నాడీ వ్యవస్థను ప్రశ...