Hyderabad, మే 12 -- మహిళలు థైరాయిడ్ సమస్య బారిన అధికంగా పడుతున్నారు. ఇప్పుడు మగవారిలో కూడా థైరాయిడ్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈ థైరాయిడ్ సమస్య నుండి బయటపడడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేస్తూ ఉండాలి. థైరాయిడ్ కారణంగా వేగంగా బరువు పెరిగే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది.

థైరాయిడ్ సమస్య తీవ్రమైతే ఎముక నొప్పి కూడా మొదలైపోతుంది. కాబట్టి థైరాయిడ్ అదుపులో ఉంచేందుకు మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి. ఇక్కడ మేము చెప్పిన మసాలా నీటిని తీసుకోవడం వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి.

థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజు రాత్రి ఒక గ్లాసులో ఒక స్పూన్ ధనియాలను గ్లాస్ నీటిలో నానబెట్టండి. ఉదయం లేచాక ఆ నీటిని వడకట్టి తాగేందుకు ప్రయత్నించండి. ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతోనే ఈ ధనియాలు తాగాలి.

అల...