భారతదేశం, మే 27 -- ఏపీలో హరిహర వీర మల్లు చిత్ర విడుదలకు ముందు థియేటర్ల బంద్ ప్రకటన, పవన్ కళ్యాణ్‌ ఆగ్రహం, సినీ నిర్మాతల వివరణల నేపథ్యంలో తాజాగా పవన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా పరిస్థితికి కారణమైన వారిలో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దని ప్రభుత్వానికి సూచించారు.

రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని... ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించినవారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మ...