Hyderabad, మే 12 -- స్టార్ హీరోయిన్, నిర్మాత సమంత రూత్ ప్రభు నిర్మాణంలో ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందించిన తొలి చిత్రం 'శుభం' . మే9న ఈ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమాకు ప్రీమియ‌ర్స్ నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. తొలిరోజున సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

ఓపెనింగ్ డే నాడు సమంత శుభం సినిమా రూ. 1.5 కోట్లు గ్రాస్ కలెక్ష‌న్స్‌ను రాబ‌ట్టింది. రెండో రోజున కూడా అదే రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ విజ‌య‌వాడ‌లో కొన్ని థియేట‌ర్స్‌ను సంద‌ర్శించింది. విజయవాడలోని థియేటర్లలో సమంత సందడి చేసింది.

హ‌ర్షిత్ రెడ్డి, గ‌విరెడ్డి శ్రీనివాస్‌, చ‌ర‌ణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావ‌ణి ల‌క్ష్మి, షాలిని కొండెపూడి, వంశీధ‌ర్ గౌడ్‌, డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ కండ్రేగుల త‌దిత‌రులు ఇన్‌స్టా లైవ్ ద్వారా ప్రేక...