భారతదేశం, మే 6 -- మెగా డీఎస్సీ-2025కి దరఖాస్తుల ప్రక్రియ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. మే 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్‌ 6 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 16 వేల 347 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు మెరుగ్గా సన్నద్ధమయ్యేందుకు 2024 నవంబరులోనే డీఎస్సీ సిలబస్‌ను అధికారికంగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చారు.

ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ గతంలోనే ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఇటు ఉపాధ్యాయుల ఎంపికలో సమానత్వం, ప్రాతినిధ్యం కోసం ఎస్సీ ఉపవర్గీకరణ అమలు చేస్తున్నారు. క్రీడాకారుల్ని ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్‌ కోటాను 3 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కూటమి ప్రభుత్వం.

నోటిఫికేషన్ విడుదల ...