భారతదేశం, మే 15 -- హీరోయిన్ పూర్ణ లీడ్ రోల్‌లో న‌టించిన త‌మిళ మూవీ విసిథిర‌న్ ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో మ‌రో తెలుగు హీరోయిన్ మ‌ధుశాలిని ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఆర్‌కే సురేష్ హీరోగా న‌టించాడు.

జోజు జార్జ్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ జోసెఫ్ కు రీమేక్‌గా విసిథిర‌న్ తెర‌కెక్కింది. మ‌ల‌యాళంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన ఈ మూవీ త‌మిళంలో మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. విసిథిర‌న్ మూవీకి త‌మిళ ద‌ర్శ‌కుడు బాలా ఓ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ప‌ద్మ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జీవీ ప్ర‌కాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. 2022లో థియేట‌ర్ల‌లో విసిథిర‌న్ మూవీ రిలీజైంది. ఐఎమ్‌డీబీలో 6.5 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

మాయ‌న్ ఓ ర...