భారతదేశం, మే 27 -- తీర్థ యాత్రలకు వెళ్లే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూన్ 14 వ తేదీ నుండి జులై 13వ తేదీ వరకు రెండు ప్యాకేజీలుగా ప్రత్యేక రైళ్లను హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ డీఎస్జీపీ కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. తీర్థ యాత్రకి సంబంధించిన వివరాలు వెల్లడించారు.

ఈ యాత్రలో (కాశీ)వారణాసి, అయోధ్య, నైమిశారణ్య, ప్రయాగరాజ్, శృంగవర్పూర్ ప్రాంతాలు దర్శించవచ్చు. ఈ యాత్ర జూన్ 14న ప్రారంభమై 22 వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర రూ.16200, థర్డ్ ఏసీ ధర రూ.26,500, సెకండ్ ఏసీ ధర రూ.35,000 ఉంటుంది.

ఈ యాత్ర స్పెషల్ ట్రైన్ సికింద్రాబాద్, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, స...