భారతదేశం, ఏప్రిల్ 22 -- తెలంగాణలో ఎండలు తీవ్రమవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. వడగాలులు వీస్తున్న కారణం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పగటి పూట ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లొద్దని పేర్కొంది.

తెలంగాణలో రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగి అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు(బుధవారం) ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచ...