భారతదేశం, జూన్ 3 -- డాన్ శీను, బలుపు, క్రాక్, వీర సింహా రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్లను అందించిన తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్ లో తీసిన ఫస్ట్ ఫిల్మ్ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. గోపీచంద్ మలినేని బాలీవుడ్ డెబ్యూ యాక్షన్ థ్రిల్లర్ ఫ్యాన్స్ ను అలరించేందుకు డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయింది. ఆ మూవీనే.. 'జాట్'. సన్నీ డియోల్ హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్లలో అదరగొట్టింది. ఇప్పుడు ఓటీటీ బాట పట్టనుంది.

తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్ డెబ్యూ మూవీ 'జాట్'. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైంది. యాక్షన్ థ్రిల్లర్ గా రిలీజైన ఈ మూవీ మాస్ ఆడియన్స్ తో విజిల్స్ కొట్టించింది. కలెక్షన్ల మోత మోగించింది. సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన జాట్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.120 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీ జూన్ 6న...