భారతదేశం, మే 9 -- మ‌ల‌యాళం బోల్డ్ థ్రిల్ల‌ర్ మూవీ చ‌తురం తెలుగులోకి వ‌చ్చింది. సైనా ప్లే ఓటీటీలో అదే పేరుతో తెలుగులో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ థ్రిల్ల‌ర్ మూవీలో స్వాసిక‌, రోష‌న్ మాథ్యూ, అలెన్సియ‌న్ లే లోఫెజ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ మూవీకి సిద్ధార్థ్ భ‌ర‌త‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌ల‌యాళంలో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ తెలుగులో మాత్రం డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

చ‌తురం మూవీ మ‌ల‌యాళంలో క‌మ‌ర్షియ‌ల్‌గా నిర్మాత‌ల‌కు మోస్తారు లాభాల‌ను తెచ్చిపెట్టింది.ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 6.2 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. వాస్త‌వ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఈ మూవీని తెర‌కెక్కించాడు.

శారీర‌కంగా లైంగికంగా వేధింపుల‌కు గురిచేసే భ‌ర్త‌పై ఓ గృహిణి ఎలా రివేంజ్ తీర్చుకుంది అన్న‌ది ల‌వ్‌, ల‌స్ట్‌, రివేంజ్‌ అంశాల‌తో ఈ మూవ...