భారతదేశం, మే 20 -- మ‌ల‌యాళం మూవీ ప‌ప్ప‌చ‌న్ ఒలివిలాను తెలుగులోకి వ‌చ్చింది. భాస్క‌ర్ దాక్కొనివున్నాడు పేరుతో ఈ మూవీ రిలీజైంది. ఈ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ నేరుగా సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మ‌ల‌యాళం మూవీ తెలుగు వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది.

భాస్క‌ర్ దాక్కొనివున్నాడు మూవీలో సైజుకురుప్‌ హీరోగా న‌టించాడు. శ్రిందా, అజు వ‌ర్గీస్‌, విజ‌య‌రాఘ‌వ‌న్‌, జ‌గ‌దీష్ కీల‌క పాత్ర‌లు పోషించారు. సింటో స‌న్నీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2023లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. కామెడీ బాగున్నా క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం ప‌ప్ప‌చ‌న్ ఒలివిలాను ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది.

మ‌త్త‌చ‌న్ గొప్ప వేట‌గాడి పేరుప్ర‌ఖ్యాతులు సంపాదించుకుంటాడు. వేట విష‌యంలో అత‌డి ధైర్య‌సాహ‌సాల‌ను ఊరివాళ్లు క‌థ‌లుగా చ...