భారతదేశం, మే 6 -- సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ విల‌న్‌గా న‌టించిన త‌మిళ మూవీ వ‌ల్లినం తెలుగులోకి వ‌చ్చింది. క‌ఠినం పేరుతో డ‌బ్ అయిన ఈ మూవీ థియేట‌ర్‌...ఓటీటీలో కాకుండా నేరుగా యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ మూవీలో న‌కుల్, మృదులా భాస్క‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. త‌మిళ హీరో ఆది పినిశెట్టి గెస్ట్ పాత్ర‌లో క‌నిపించాడు.

కెరీర్ ఆరంభంలో న‌టుడిగా నిల‌దొక్కుకునే రోజుల్లో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ న‌టించిన మూవీ ఇది. వ‌ల్లినం మూవీలో సిద్ధార్థ్ జొన్న‌ల‌న‌గ‌డ్డ పేరుతో న‌టించాడు. స్పోర్ట్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ విల‌న్‌గా న‌టించ‌డం గ‌మ‌నార్హం. వంశీ అనే క్రికెట్ టీమ్ కెప్టెన్ పాత్ర‌లో క‌నిపించాడు.

క‌ఠినం మూవీకి వైశాలి ఫేమ్ అరివ‌జ‌గ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌మ‌న్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. బెస్ట్ ఎడిటింగ్ విభాగంలో క‌ఠినం మూవీ నే...