భారతదేశం, మే 29 -- టొవినో థామ‌స్ హీరోగా న‌టించిన లేటెస్ట్ మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ న‌రివెట్ట తెలుగులోకి వ‌స్తోంది. థియేట‌ర్ల‌లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ తెలుగులో విడుద‌ల‌చేస్తోంది. ఈ విష‌యాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. ఆ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది. రిలీజ్ డేట్‌ను మాత్రం రివీల్ చేయ‌లేదు. జూన్ ఫ‌స్ట్ వీక్‌లో న‌రివెట్ట మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇటీవ‌ల మ‌ల‌యాళంలో థియేట‌ర్ల‌లో రిలీజైన న‌రివెట్ట మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ప‌దిహేను కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైంది. ఆరు రోజుల్లో ప‌ది కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ వీకెండ్‌లోనే మూవీ బ్రేక్ ఈవెన్‌లోకి అడుగుపెట్టే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ ...