Hyderabad,telangana, మే 3 -- తెలంగాణ డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొత్తం 3 విడతల్లో అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు. మే 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

తొలి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 21వ తేదీవ తేదీతో పూర్తి కానుంది. అభ్యర్థులు రూ. 200 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన అభ్యర్థులు.. మే 10వ తేదీ నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. మే 29వ తేదీన తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.

తొలి విడతలో సీట్లు పొందే విద్యార్థులు మే 30వ తేదీ నుంచి జూన్ 6లోపు సీటు పొందిన కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే సీటు రద్దు అవుతుంది. ఫస్ట్...