Telangana,hyderabad, జూలై 20 -- తెలంగాణ వైద్యారోగ్యశాఖలో భారీగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా పలు నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. వీటిలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీకి ఇటీవలే ప్రకటన విడుదలైంది. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ్టి నుంచి షురూ కానుంది.

అర్హులైన అభ్యర్థులు జూలై 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://mhsrb.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుం కింద రూ. 500 చెల్లించాలి. ఇదే కాకుండా ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. జూలై 28వ తేదీ నుంచి జూలై 29వ తేదీ వరకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....