Telangana, జూన్ 20 -- తెలంగాలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడుతలు పూర్తి కాగా... ప్రస్తుతం మూడో విడత ప్రవేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల గడువు జూన్ 19వ తేదీతో పూర్తయింది. ఈ నేపథ్యంలో అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువును పొడిగించారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది.

దోస్త్‌ 3వ విడత రిజిస్ట్రేషన్లకు గడువును ఈనెల 25 వరకు పొడిగించారు. ఈ తేదీల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అభ్యర్థులు.. వెబ్ ఆప్షన్లను కూడా ఎంచుకోవాలి. ఇందుకు కూడా జూన్ 25వ తేదీనే తుది గడువుగా నిర్ణయించారు. జూన్ 28వ తేదీన విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. జూన్ 28 నుంచి 30 తేదీల మధ్య ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాలి. అంతేకాకుండా జూన్ 28 నుంచి జూలై 1వ తేదీల మధ్య ఆయా కాల...