Telangana, జూన్ 6 -- రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే పలుచోట్ల సాగు పనులు షురూ అవుతున్నాయి. ఈసారి ముందుగానే రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వటంతో. రైతులు సాగుబాటు పనులకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే. రైతు భరోసా నిధులపై కూడా ఆశలు పెంచుకుంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ కు ముందుగానే డబ్బులు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

అయితే రైతు భరోసా స్కీమ్ నిధులపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. రైతాంగానికి కావాల్సిన ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందన్నారు. తెలంగాణ రైతులను కాపాడుకుంటూ రూ. 35 వేల కోట్లను జమ చేశామని చెప్పారు. అయితే ఈ సంవత్సరం రైతు భరోసా డబ్బులను... పంటలు వేయకముందే రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పుకొచ్చారు.

ఇవాళ హుస్నాబాద్ మార్కెట్ కమిటీలో మంత్రి తుమ్మల 'తెలంగాణ రైతు మహోత్సవం'ను ప్రారంభించారు...