భారతదేశం, నవంబర్ 25 -- డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2025 కోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరవుతున్న ఈ అంతర్జాతీయ సదస్సుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు.

ఈ రోజు నుంచి నవంబర్ 30 వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ICCCలో ఈ అంశాలపై వరుస సమావేశాలను నిర్వహిస్తారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, 2047 నాటికి తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన తెలంగాణ రైజింగ్ దార్శనిక పత్రంపై తుదిమెరుగులు దిద్దనున్నారు.

వరుస సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతోపాటుగా అంశాల వారిగా జరిగే సమీక్షల్లో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఒక్కో రోజు ఒక్కో అంశంపై సమీక్...