Telangana, మే 4 -- రాష్ట్రంలో భూముల నిర్వహణతో పాటు రిజిస్ట్రేషన్ల వంటి అంశాలను చూసే ధరణి స్థానంలో 'భూ భారతి' తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14వ తేదీ నుంచి నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్ట్ గా ఈ సేవలను ప్రారంభించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.

భూ భారతి పోర్టల్ ద్వారా పలు సేవలను అందిస్తున్న ప్రభుత్వం. తాజాగా మరో అప్డేట్ ఇచ్చింది. భూ భారతి పోర్టల్ సమస్యలు, విచారణ కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పోర్టల్ లో తలెత్తే సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు వీలుగా 9140 - 29313999 నెంబర్ ను ప్రారంభించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఈ సేవలను పొందవచ్చని ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి పోర్టల్ లో సేవలను రెండు విభాగ...