Telangana, మే 17 -- మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు ముగియటంతో అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. అర్హులైన విద్యార్థులు మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. 2025 -26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ మొదటి ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హులైన విద్యార్థులు tgrdccet.cgg.gov.in/TGRDCWEB వెబ్ సైట్ ద్వారా లేదా https://mjpabcwreis.cgg.gov.in/TSMJBCWEB/ వెబ్ సైట్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి.

ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు అర్హులవుతారు. రెగ్యులర్‌ కోర్సులతోపాటు ఫైన్‌ ఆర్ట్స్‌, యానిమేషన్‌ తదితర వృత్తి విద్య కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రవేశాల కోసం ఆన్ లైన్ ద్వారానే దరఖాస్తు చేస...