Telangana, మే 12 -- తెలంగాణలోని మహాత్మ పూలే బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల కొనసాగుతుండగా. ఈ గడువు మే 12వ తేదీతో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. అర్హులైన విద్యార్థులు మే 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

ఇందులో భాగంగా 2025- 26 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఇందుకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఎలాంటి ఎంట్రెన్స్ పరీక్ష లేకుండా సీట్లను భర్తీ చేస్తారు.

కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. మెరిట్ తో పాటు రిజర్వేషన్లను ప్రమాణికంగా తీసుకుంటారు. వీటి ఆధారంగా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్ ఈసీతో పాటు వొకేషనల్ కోర్సుల్లో ...