Telangana, మే 25 -- తెలంగాణలోని మహాత్మ పూలే బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాల ఫలితాలు విడుదలయ్యాయి. అర్హులైన విద్యార్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. ఎలాంటి అర్హత పరీక్ష లేకుండా. కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఫలితాలను ప్రకటించారు. ఇందుకు సంబంధించిన జాబితాను https://mjpabcwreis.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

అర్హత పొందిన విద్యార్థులకు 2025- 26 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 130 జూనియర్‌ కాలేజీల్లో బాలురకు 11,360 సీట్లు, 127 జూనియర్‌ కాలేజీల్లో బాలికలకు 10,720 సీట్లు అందుబాటులో ఉండగా.. మొత్తం 22, 080 మందిని ఎంపిక చేసినట్టు అధికారులు తెలిపారు.

కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు చేశారు....