Telamgana, జూన్ 26 -- ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ మరో తీపి కబురు చెప్పింది. ఇటీవలనే డీఏ పెంపుపై ప్రకటన చేసిన ప్రభుత్వం.. తాజాగా పెండింగ్ మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వివరాలను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.
04-03-2023 నుంచి 20-06-2025 వరకు పెండింగ్లో ఉన్న రూ.180.38 కోట్ల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నిర్ణయంతో 26,519కి ఊరట దక్కనుందని వెల్లడించారు.
తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం కోసం నిర్ణయం తీసుకున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. " లెక్కకు మించిన సంక్షేమ పథకాలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులకు ప్రాధాన్యత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.