Hyderabad,telangana, మే 13 -- తెలంగాణ డాక్టరేట్స్ అసోసియేషన్ (TGDA)రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్. వీరమళ్ల రామ్ నర్సింహ్మా గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పెద్దిరెడ్డి నరేందర్ రెడ్డి, పూర్వపు అధ్యక్షుడు డాక్టర్ రమణ రావు చేతుల మీదుగా నియామకపత్రాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ రామ్ నర్సింహా గౌడ్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక విషయంలో అర్హులకు అన్యాయం జరగకుండా పోరాడుతామని చెప్పారు. జీవో 21ని సవరించే విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే దిశగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. యూజీసీ రూల్స్ 2018 ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

రామ్ నర్సింహా గౌడ్... ఉస్మానియా యూనివర్సిటీలోని లా కాలేజీలో పీహెచ్డీ పూర్తి చ...