Telangana, జూన్ 3 -- తెలంగాణలో ఈ ఏడాదికి సంబంధించిన ఐటీఐ ట్రేడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ రాష్ట్ర ఉపాధి- శిక్షణ కమిషనర్‌ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మొదటి విడత (ఆగస్టు -2025) కింద ప్రవేశాలను కల్పించనున్నారు.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2025-26 సెషన్‌కు గాను ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. జూన్‌ 21వ తేదీలోగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. https://iti.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....