Telangana, మే 1 -- తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు బోర్డు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ వివరాల ప్రకారం.. జూన్‌ 3 నుంచి 13వ తేదీ వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జరుగుతాయని పదో తరగతి బోర్డు ప్రకటించింది.

విద్యార్థులు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు మే 16వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సైబర్ ట్రెజరీ ద్వారా అనుసంధానించిన ఆన్ లైన్ లో పరీక్ష రుసుము చెల్లించడానికి చివరి తేదీగా మే 17 ఉంది. సంబంధిత సబ్జెక్టులో పరీక్ష ప్రారంభానికి 2 రోజుల ముందు వరకు రూ.50 ఆలస్య రుసుముతో కూడా ఫీజు చెల్లించవచ్చు.

ఇక ఫలితాలపై రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు మే 15వరకు అవకాశం కల్పించారు. ఇందుకోసం స...