Telangana, జూన్ 4 -- తెలంగాణ టెట్‌ 2025 (జూన్ I) పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఈనెల 15 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అన్ని సబ్జెక్టుల పరీక్షలు జూన్ 30వ తేదీ నాటికి ముగుస్తాయి. పరీక్షల సమయం దగ్గరపడిన నేపథ్యంలో విద్యాశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. అభ్యర్థులు ఉచితంగా మాక్ టెస్టులు రాసే అవకాశం కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో మాక్ టెస్ట్ ఆప్షన్ తీసుకొచ్చింది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి ఉచితంగా అభ్యర్థులు పరీక్షలు రాసుకునే వీలు ఉంటుంది.

టీచింగ్ బోధనకు టెట్ అర్హత తప్పనిసరి. అంతేకాకుండా డీఎస్సీలో వేయిటేజీ కూడా ఉంటుంది. కాబట్టి టెట్ లో క్వాలిఫై కావటంతో పాటు మంచి స్కోర్ సాధించటం కోసం అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. ఇందుకోసం చాలా మంది ఇంటి వద్దే సన్నద్ధం అవుతుంటారు. అయితే పరీక్షా విధానం, ప్రశ్నాల సరళి, సమయాభావ...