Telangana,hyderabad, సెప్టెంబర్ 13 -- గ్రూప్‌-2 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన చేసింది. 3వ విడత సర్టిఫికెట్ తేదీని ప్రకటించింది. ఇవాళ ఉదయం 10.30 గంటల నుంచి నాంపల్లి పబ్లిక్‌గార్డెన్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో(గతంలో పొట్టి శ్రీరాములు యూనివర్శిటీ) ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతుందని ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం వివరాలను వెల్లడించింది.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరయ్యాక సమర్పించాల్సిన పత్రాలు ఇంకా ఏమైనా పెండింగ్‌లో ఉంటే వాటిని సెప్టెంబరు 15న సమర్పించవచ్చని టీజీపీఎస్సీ సూచించింది. ఇప్పటికే గ్రూప్ 2 ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://www.tgpsc.gov.in లో అందుబాటులో ఉంచారు. హాల్ టికెట్ నెంబర్లను పేర్కొన్నారు.

టీజీపీఎస్సీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం. అభ్యర...