Telangana, జూన్ 8 -- తెలంగాణ కేబినెట్ విస్తరణకు వేళైంది. సుదీర్ఘ కసరత్తు తర్వాత. విస్తరణకు ఆ పార్టీ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం(12:19 గంటలకు) రాజ్ భవన్ లో కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.

ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇందులో మూడింటిని భర్తీ చేయనున్నారు. మిగిలిన మూడింటిని త్వరలోనే భర్తీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత కేబినెట్ విస్తరణలో ఎస్సీలకు రెండు, బీసీ సామాజికవర్గానికి మరో బెర్త్ ను ఖరారు చేశారు.

విస్తరణలో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే వివేక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కేబినెట్ లో బెర్త్ ఖరారైనట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి ఈ ముగ్గురికి ఇప్పటికే సమాచారం రాగా. ప్రమాణస్వీకారానికి సిద్ధమ...