Telangana, జూన్ 7 -- తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం(టాస్‌) పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేశాయ్. ఏప్రిల్, మే మధ్యలో ఈ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు. టాస్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఈసారి మొత్తం 28,547 మంది అభ్యర్థులు ఓపెన్ టెన్త్ పరీక్షలు రాయగా, 16,443 (57.80) శాతం ఉత్తీర్ణత సాధించారు. మార్కుల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 12 నుంచి 18 వరకు ఫీజు చెల్లించుకోవచ్చు.

మరోవైపు తెలంగాణ ఓపెన్ ఇంటర్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థులు టాస్ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అడ్మిషన్ నెంబర్ లేదా రూల్ నెంబర్ ఎంట్రీ చేసి స్కోర్ వివరాలను పొందవచ్చని అధికారులు సూచించారు. ఈసారి మొత్తం 41,051మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా.24,538 మంది పాస్ అయ్యారు.

తెలంగాణ సార్వత్రిక...