Telangana,hyderabad, మే 25 -- తెలంగాణ ఈసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు ఈసెట్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ ఫలితాల్లో 93.87 శాతం ఉత్తీర్ణ‌త నమోదైంది. త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల కానుంది. ర్యాంకుతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

రాష్ట్ర వ్యాప్తంగా మే 12వ తేదీన ఈసెట్ పరీక్షను నిర్వహించారు. అర్హత సాధించిన వారికి పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) అభ్యర్థులకు 2025-2026 విద్యా సంవత్సరంలో బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.

మే 14వ తేదీన తెలంగాణ ఈసెట్ 2024 ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. మే 16 వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించారు. దీంతో ఇవాళ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి జరిగిన పరీక్...