Telangana,hyderabad, జూన్ 4 -- తెలంగాణ ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్ ల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా హైదరాబాద్ తో పాటు వరంగల్ లో ఉన్న కాలేజీలో ప్రవేశాలను కల్పిస్తారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఆన్ లైన్ దరఖాస్తులకు జూన్ 21వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

మోటార్‌ మెకానిక్‌ వెహికిల్‌, మెకానిక్‌ డిజిల్‌, వెల్డర్‌, పెయింటర్‌ ట్రెడ్‌లలో ప్రవేశాలు జరుగుతున్నాయి. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీజీఎస్‌ ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిస్ సౌకర్యం సంస్థ కల్పిస్తుందని ఎండీ సజ్జనార్ తెలిపారు.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 21వ తేదీలోపు https://iti.telangana.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు ...