Telangana, జూన్ 8 -- తెలంగాణ కేబినెట్ విస్తరణతో పాటు కీలక పదవుల భర్తీపై కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టిపెట్టింది. కేబినెట్ విస్తరణలో భాగంగా ముగ్గురు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. ఇందులో ఇద్దరు ఎస్సీ, ఒకరు బీసీ సామాజికవర్గం నుంచి ఉన్నారు. అయితే ఎస్టీ(లంబాడా) సామాజికవర్గం నుంచి కేబినెట్ లో ఎవరూ లేరు. దీంతో ఆ సామాజికవర్గానికి కీలకమైన పదవి కట్టబెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది.

కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం మేరకు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రు నాయక్ ఖరారయ్యారు. ఇయన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోర్నకల్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ నియామాకానికి సంబంధించి అసెంబ్లీ కార్యాలయం నుంచి నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. నోటిఫికేషన్ జారీ కాగానే. నియామక ప్రక్రియను పూర్తి చేస్తారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా...