భారతదేశం, ఫిబ్రవరి 11 -- రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరుకు సిద్ధమైంది. 7 నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2,569 వార్డుల్లో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అన్ని పోలింగ్‌ కేంద్రాల లోపల, బయట వెబ్‌కాస్టింగ్‌ పర్యవేక్షణ ఉంచింది. పోలింగ్‌ ప్రాంతాల్లో బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.

ఈ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 26.80 లక్షల మంది మహిళా ఓటర్లు, 25.62 లక్షల మంది పురుష ఓటర్లు, ఇతరులలో 640 మంది ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్ల భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. మొత్తంగా ఈ ఎన్నికల బరిలో 12,993 మంది అభ్యర్థులున్నారు. పోలి...