Hyderabad,telangana, మే 3 -- రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మే 7 నుంచి 31 వరకు 72 వ మిస్ వరల్డ్ 2025 పోటీలు జరగనున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ప్రత్యేకతలను ప్రపంచానికి తెలిపేలా, అంతర్జాతీయంగా రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ పెంచేలా నిర్వహించేందుకు ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేసింది. మిస్ వరల్డ్ పోటీలను సువర్ణ అవకాశంగా మలుచుకొని. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేలా ప్రయత్నాలు చేస్తోంది.

"ప్రపంచం కళ్లన్నీ తెలంగాణ వైపే!" అనే స్లోగన్ తో ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. సుమారు 120 దేశాల నుంచి కంటెస్టెంట్ లు. ఈ మెగా ఈవెంట్ లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పర్యాటక ఆకర్షణలు, మెడికల్, సేఫ్టీ టూరిజం, తెలంగాణ గ్రోత్ స్టోరీ , ఇతర ప్రత్యేకతలు ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రత్యేక థీమ్స్ , టూరిస్ట్ సర్క్యూట్లు రూపొందించారు....