భారతదేశం, సెప్టెంబర్ 1 -- తెలంగాణలో వైద్య విద్య గురించి సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ మేరకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదవాల్సిందే. ఈ మేరకు గతంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి, డివిజెన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు పక్కన పెడుతూ.. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది.

ఈ మేరకు రాష్ట్ర కోటా కింద వైద్య, దంత కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన స్థానికత నిబంధనను సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, న్యాయమూర్తి కె.వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను అనుమతించి, తెలంగాణ మెడికల్ అండ్ డెంటల్ కాలేజీల అడ్మిష...