భారతదేశం, మే 5 -- తెలంగాణలో భూమి కంపించింది. క‌రీంన‌గ‌ర్, సిరిసిల్ల,జగిత్యాల, వేములవాడ, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భూప్రకంపనలు వచ్చాయి. భూకంపం అని భ‌యంతో ప్రజలు బ‌య‌టికి ప‌రుగులు తీశారు. రెండుసార్లు భూమి తీవ్రంగా కంపించిందని స్థానికులు అంటున్నారు. క‌రీంన‌గ‌ర్‌తో పాటు శివారు ప్రాంతాల్లో భ‌వ‌నాలు, ఇండ్లు కంపించాయి.

కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా భూప్రకంపనలు వచ్చాయి. చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళన చెందారు. నిర్మల్‌ జిల్లాలోనూ పలు చోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....