Telangana news, మే 13 -- తెలంగాణ ఈఏపీసెట్ 2025 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో క్వాలిఫై అయిన విద్యార్థులు కాలేజీల ఎంపిక విషయంలో కసరత్తు మొదలుపెట్టారు. తమ ర్యాంకుల ఆధారంగా ఏ కాలేజీ అయితే బెటర్ అన్నదానిపై క్లారిటీ తీసుకునే పనిలో పడ్డారు. ఏ కాలేజీలో చేరితే మంచి అవకాశాలు ఉంటాయనే దానిపై ఓ అవగాహనకు వచ్చే పనిలో ఉన్నారు.

గతేడాదితో పోల్చితే ఈసారి ముందుగానే ఈఏపీసెట్ పరీక్షలు ముగిశాయి. అయితే ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ ను జూన్‌ నెలాఖరు లేదా జూలై మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ఉన్నత విద్యా మండలి నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంటుంది.

ఫలితాలు వచ్చిన నేపథ్యంలో.. ఏ క్షణమైనా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అయితే ర్యాంకుల ఆధారంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ముందుగానే కాలేజీల ఎంపి...