భారతదేశం, మే 28 -- తెలంగాణలో రూ.4వేల కోట్లతో 20 యంగ్ ఇండియా పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ నియోజక వర్గానికో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నారు.

తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో ఒక యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 20 నియోజక వర్గాల్లో 20 పాఠశాలలను మంజూరు చేస్తూ మంగళవారం జీవో 96 జారీ చేసింది. ఒక్కో పాఠశాలకి రూ.200 కోట్ల చొప్పున మొత్తం రూ.4 వేల కోట్ల మంజూరుకు పరిపాలనా అనుమతి జారీ చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా జీఓ 96 విడుదల చేశారు.

గత జనవరిలో తెలంగాణలో మూడు యంగ్ ఇండియా పాఠశాలలకు రూ.600 కోట్లు విడుదల చేశారు. మార్చి 8న మరో 55 పాఠశాలలకు రూ.11 వేల కోట్లకు పరిపాలనా పరమైన అనుమతులిచ్...