Telangana, మే 2 -- తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఆన్ లైన్ ద్వారా డిగ్రీ మొదటి సంవత్సరానికి సంబంధించిన సీట్లను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంంబధించిన వివరాలను ఉన్నత విద్యామండలి వెల్లడించింది. మొత్తం మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయనుంది.

ఫస్ట్ ఫేజ్ లో భాగంగా మే 3వ తేదీ నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. రూ. 200 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు మే 21వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. మే 10వ తేదీ నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. మే 29న మొదటి ఫేజ్‌ సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఇక రెండో విడత కింద మే 30 నుంచి జూన్‌ 8 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. మే 30 నుంచి జూన్‌ 9 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. జూన్‌ 13న సీట్ల కేటాయింపు ఉంటుందని విద్యా మండలి ప్రకట...