Telangana, జూన్ 14 -- దోస్త్ - 2025 ప్రవేశాలు కొనసాగుతున్నాయి. సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తిగా. అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. శుక్రవారం నుంచే థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అర్హులైన విద్యార్థులు.. జూన్ 19వ తేదీ వరకు దోస్త్ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

దోస్త్ 3వ విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్‌ 13 నుంచి మొదలైంది. ఈ గడువు జూన్ 19తో పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్లు ఈ తేదీల్లోనే వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. జూన్‌ 23న విద్యార్థులకు సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 23వ తేదీ నుంచి 28వ తేదీల మధ్య సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. జూన్ 24 నుంచి 28వ తేదీల మధ్య ఓరియేంటేషన్ ఉంటుంది. జూన్ 30వ తేదీన డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి.

దోస్త్ అన్ని వ...