భారతదేశం, మే 15 -- తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తుంది. ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసి...మే నెల నుంచి రేషన్ తీసుకునేందుకు అర్హులని మెసేజ్ లు పంపిస్తుంది.

కొత్త కార్డులు పొందిన వారు చౌక ధరల దుకాణాల నుంచి మే నెల రేషన్ బియ్యం పొందవచ్చని సివిల్ సప్లై అధికారులు తెలిపారు. కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ కార్డు నెంబర్ తో పాటు మెసేజ్ లు పంపామని, వారు తమ కార్డు స్టేటస్ ను తనిఖీ చేయవచ్చని చెప్పారు.

కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకున్న మీ సేవాలో ఇచ్చిన రిఫరెన్స్ నెంబర్ ఆధారంగా స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు.

రేషన్ కార్డు నెంబర్ ఆధారంగా అధికారిక వెబ్‌సైట్‌లో తమ కార్డును నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డులో కుటుంబసభ్యుల ...