భారతదేశం, డిసెంబర్ 26 -- కేరళ రాజకీయాల్లో ఒక సంచలనం నమోదైంది. దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు వామపక్షాలకు కంచుకోటగా ఉన్న తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్పై భారతీయ జనతా పార్టీ తొలిసారిగా విజయకేతనం ఎగురవేసింది. ఈ చారిత్రక ఘట్టంలో నగర ప్రథమ పౌరుడిగా (మేయర్) సీనియర్ నేత, వృత్తిరీత్యా న్యాయవాది అయిన వీవీ రాజేష్ పేరును పార్టీ ఖరారు చేసింది.
గురువారం జరిగిన నూతన కౌన్సిలర్ల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్ ఈ ప్రకటన చేశారు. మేయర్ అభ్యర్థిగా వీవీ రాజేష్ను, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా మహిళా కౌన్సిలర్ ఆశా నాథ్ను పార్టీ ఎంపిక చేసింది. నేడు (శుక్రవారం) వీరికి సంబంధించిన ఎన్నికలు జరగనున్నాయి.
50 ఏళ్ల వీవీ రాజేష్ కేరళ బీజేపీలో అత్యంత అనుభవజ్ఞుడైన నాయకుడు. దాదాపు మూడు దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్న ఆయన రాజకీయ ప్రస్థానం 19...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.