భారతదేశం, మే 13 -- తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి నిత్యం వేల మంది భక్తులు దేశవిదేశాల నుంచి తరలి వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ పలు రకాలుగా దర్శన ఏర్పాట్లు చేస్తుంది.

వీటిల్లో వీఐపీ సిఫార్సు లేఖలు ఒకటి. వీఐపీలు సిఫార్సు చేసిన వారికి తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఇటీవల వీఐపీ సిఫార్లు లేఖలను నిలిపివేశారు.

తిరుమలలో మే 15 నుంచి వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కల్పిస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరిస్తామని స్పష్టం చేశారు.

వేసవి సెలవుల కారణంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఇటీవల టీటీడీ సిఫార్సు లేఖలపై బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్...