Andhrapradesh,tirumala, సెప్టెంబర్ 5 -- చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఆరోజు సాయంత్రం 3.30 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున అనగా సెప్టెంబర్ 8వ తారీఖు 3 గంటల వరకు ఆలయాన్ని సుమారు 12గం పాటు మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం. మరో అప్డేట్ ఇచ్చింది.

చంద్రగ్రహణం కారణంగా. సెప్టెంబర్ 8వ తేదీ దర్శనం కోసం 7వ తేదీ వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. 8వ తేదీన నేరుగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులను మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతించనున్నారు.

అదేవిధంగా 7వ తేదీన శ్రీవాణి ఆఫ్ లైన్ దర్శనాల సమయాన్ని మధ్యాహ్నం 1 గంటకు మార్పు చేయడం జరిగిందని టీటీడీ వెల్లడించింది. కాగా సెప్టెంబర్ 16వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా సెప్టెంబర్ 15వ తేదీన కూడా వీఐపీ సిఫార్స...