Andhrapradesh, జూలై 31 -- తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. శ్రీవాణి టికెట్లపై శ్రీవారి దర్శన విధానంలో మార్పులు తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ఏ రోజు టికెట్‌ తీసుకుంటే. అదే రోజు దర్శనానికి వీలు కల్పించనుంది. ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది.

శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్లు ఆఫ్ లైన్లో పొంది శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం విచ్చేసే భ‌క్తుల సౌక‌ర్యార్థం వారి ద‌ర్శ‌న స‌మ‌యాల్లో మార్పులు చేస్తున్న‌ట్లు టీటీడీ అద‌నపు ఈవో హెచ్‌.వెంక‌య్య చౌద‌రి తెలిపారు. తిరుమ‌ల‌లోని గోకులం స‌మావేశ మందిరంలో శ్రీ‌వాణి దర్శ‌నాల‌పై బుధవారం నాడు స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....