భారతదేశం, అక్టోబర్ 31 -- తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. వచ్చే నవంబర్ నెలలో జరిగే విశేష పర్వదినాల వివరాలను ప్రకటించింది. నవంబర్ 2న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస దీక్ష సమాప్తి ఉంటుందని పేర్కొంది.నవంబర్ 5న కార్తీక పౌర్ణమి గరుడ సేవ ఉండగా. నవంబర్ 9న కార్తీక వన భోజనం నిర్వహిస్తారు. నవంబర్ 25న తిరుమంగైయాళ్వార్ ఉత్సవారంభం ఉంటుంది.

* నవంబర్ 1న ప్రబోధనైకాదశి, పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

* నవంబర్ 2న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస దీక్ష సమాప్తి.

* నవంబర్ 5న కార్తీక పౌర్ణమి గరుడ సేవ.

* నవంబర్ 9న కార్తీక వన భోజనం.

* నవంబర్ 15న సర్వ ఏకాదశి.

* నవంబర్ 17న ధన్వంతరి జయంతి.

* నవంబర్ 18న మాస శివరాత్రి.

* నవంబర్ 25న తిరుమంగైయాళ్వార్ ఉత్సవారంభం.

తిరుమలలో ఇవాళ వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం జరిగింది. దాససాహిత్య ప్రాజెక...