భారతదేశం, మే 31 -- తిరుమల శ్రీ‌వారి ద‌ర్శనార్థం వచ్చే భ‌క్తుల కోసం టీటీడీ సిబ్బంది అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నా భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బతినేలా మాట్లాడ‌టం స‌రికాద‌ని టీటీడీ అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి అన్నారు. వేస‌వి సెల‌వుల కార‌ణంగా తిరుమ‌ల‌లో అధిక ర‌ద్దీ నెల‌కొన‌డంతో శిలాతోర‌ణం దగ్గర మొదలవుతున్న ద‌ర్శన క్యూలైన్లను ఆయ‌న శ‌నివారం ప‌రిశీలించారు.

భ‌క్తుల‌కు పంపిణీ చేస్తున్న అన్న, పానీయాలు గురించి వారితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భ‌క్తులంద‌రూ టీటీడీ అందిస్తున్న సౌక‌ర్యాల‌పై అద‌న‌పు ఈవో వ‌ద్ద సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... నిన్న ఓ వ్యక్తి ద‌ర్శన క్యూలైన్ లో అన్న ప్రసాదాలు అంద‌లేద‌ని నినాదాలు చేసిన విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చింద‌న్నారు. ఆయ‌నను వెంట‌నే సంప్రదించి ఆరా తీయ‌గా త‌న‌కు ఆరోగ్యం స‌ర...