భారతదేశం, జనవరి 13 -- తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం జనవరి చివరి నాటికి రెండో ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఏడాదికి పైగా కొనసాగుతున్న దర్యాప్తు చివరి దశకు చేరుకుంది. ఆధారాల సేకరణ, వాంగ్మూలాల నమోదు, పత్రాల పరిశీలన వంటి కీలక ప్రక్రియలు చాలావరకు పూర్తయ్యాయి. ప్రస్తుతం సిట్ తుది చట్టపరమైన పరిశీలన, డాక్యుమెంటేషన్ పనిలో నిమగ్నమై ఉందని తెలుస్తోంది. రాబోయే రెండు వారాల్లో నెల్లూరు ఏసీబీ కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేయనుంది.
సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు గత వారం తిరుపతిలోని ఎస్ఐటీ కార్యాలయాన్ని సందర్శించి ఎస్ఐటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. దర్యాప్తు పురోగతిని, కేసు ఫైళ్లను పరిశీలించారు. ఈ సమావేశంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి, విశాఖపట్నం రే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.