Andhrapradesh,tirumala, జూలై 23 -- తిరుమల శ్రీవారి భక్తులకు మరో అప్డేట్ వచ్చేసింది. మరింత సౌకర్యవంతంగా శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేసేందుకు కొత్త కౌంటర్ ను ప్రారంభించింది. ఈ కొత్తగా ఏర్పాటు చేసిన కేంద్రం తిరుమల అన్నమయ్య భవనం ఎదురుగా ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
శ్రీవాణి దర్శన టికెట్ల కోసం భక్తులు ఉదయం 5 గంటల నుంచే క్యూలైన్లలో నిలబడుతున్నారని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో భక్తులకు సులభతరంగా టికెట్లు జారీ చేసేందుకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో రూ.60 లక్షల వ్యయంతో ఈ నూతన కౌంటర్లను నిర్మించినట్లు పేర్కొన్నారు.
కొత్తగా ఏర్పాటైన ఈ కేంద్రంలో ఇవాళ్టి నుంచి టికెట్ల పంపిణీ ప్రారంభమైంది. భక్తులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కోరారు.
తిరుమలలో నూతనంగా ఏర్పా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.